KMM: ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సర్దార్ వల్లభభాయి పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ పటేల్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు.