W.G: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాణి సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ అధికారులు వారిని ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.