VZM: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. అర్జీదారులు తమ వివరాలతో పాటు పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలని సూచించారు.