VZM: పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు మహిళకు అందించినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు బుధవారం తెలిపారు. గజపతినగరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న మహిళ పాఠశాలకు ఆటోలో వెళుతూ తన పర్స్లో 30 వేల రూపాయలు పోగొట్టుకున్నది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి దానిని కనిపెట్టి మహిళకు అందజేసినట్లు తెలిపారు.