ATP: గుంతకల్లు మండలం నెలగొండ గ్రామంలో మంగళవారం తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేలకొండ గ్రామంలో హిందూ స్మశాన వాటికకు స్థలము కేటాయించాలని గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీపీ మాధవి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.