GNTR: ఫిరంగిపురంలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో సీపీఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటియూ మండల నాయకుల ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటియూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, మండల కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.