సత్యసాయి: ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గుడిబండ మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. బంబుల బండ, గోల్ల హట్టి, రొప్పం సహా పలు ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సమస్యలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన నియోజకవర్గం ఇప్పుడు కూటమి పాలనలో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.