CTR: రానున్న మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో నివానది పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని DSPసాయినాథ్ సూచించారు. శనివారం రాత్రి నది సమీపంలో నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలలోని వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. ఏవైన ఇబ్బందులు ఏర్పడితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.