SKLM: జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు అందరు రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు పిలుపునిచ్చారు. గురువారం ఆయన కె ఆర్ స్టేడియంలో క్రీడా పోటీలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, ఉద్యోగుల ఐక్యత పెంపొందిస్తాయన్నారు.