ATP: గుత్తి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రావణమాసం చివరి గురువారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామున సాయిబాబా ప్రతిమకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా మూలమూర్తికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి కాకడ హారతి, అష్టోత్తర, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాబా నామస్మరణతో ఆలయం మార్మోగింది.