KDP: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఇంఛార్జ్ మంత్రి సవిత సోమవారం కడప జిల్లా పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆమె పెనుగొండ నుంచి రోడ్డుమార్గంలో కడపకు వచ్చి ఆర్అండీబీ అతిథిగృహంలో బసచేస్తారు. అక్కడ కాసేపు కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఒంటిమిట్ట వెళ్లి అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు.