KRNL: ఆదోనిలోని అమరావతి నగర్లో బెరాకా ప్రార్థనా మందిరంలో పాస్టర్ ఆశీర్వాదం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయని, మతగ్రంథాలు సన్మార్గంలో నడవాలని ఉపదేశించాయని చెప్పారు.