PPM: కురుపాం మండలం రస్తాకుంటుబాయిలో కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. 2025-26లో చేపట్టిన కార్యక్రమాల సమీక్షతో పాటు 2026-27 కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశానికి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధనా సంచాలకులు డా. ఏ.అప్పలస్వామి అధ్యక్షత వహించగా, డా.బి.ముకుందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.