VZM: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు అన్నారు. శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.