CTR: రొంపిచర్ల మండలంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. చెంచమరెడ్డిగారి పల్లి గ్రామపంచాయతీ, బుసిరెడ్డిగారిపల్లిలో ప్రజలతో మమేకం అయ్యారు. పెద్దమల్లెల గ్రామపంచాయతీలో సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని హామీ ఇచ్చారు.