SKLM: అదాని గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, ప్రోత్సాహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు బి.శ్రీరామూర్తి ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు.