AKP: రాంబిల్లి మండలం గోకివాడలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడపాలని తెలిపారు.