NDL: పాణ్యం గ్రామానికి చెందిన మంగలి వెంకటసుబ్బయ్య (62) మృతదేహం శుక్రవారం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. నీటిలో శవం తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామసుబ్బయ్య కుమారుడిగా గుర్తించారు.