సత్యసాయి: నేషనల్ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి శైలజకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్థిక సాయం అందజేశారు. ఆమె క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా రూ.35,000 నగదును అందజేశారు. కదిరి రూరల్ నాయకులు భార్గవ, కదిరప్ప, ఆది, నరేష్, అంజి తదితరుల సమక్షంలో ఈ సాయం అందించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.