W.G: పెనుమంట్రలో శుక్రవారం ANM భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ‘ఫ్రైడే -డ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద చెత్త, పాత వస్తువులు ఉంచడం వల్ల దోమలు పెరిగి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని వివరించారు. అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.