W.G: తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 24న ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వి.చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీపీ శేషులత అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.