BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు సూర్యరాజు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.