NTR: విజయవాడలోని ఏపీ ఐఐసీ కాలనీలోని తులసమ్మ కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళలకు రూ.4 కోట్ల రుణం చెక్కును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, మహిళలు తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.