NLR: జిల్లా గ్రామ పంచాయతీలు చెత్త నుంచి ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాన్ని ఆకస్మికంగా ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉందో పరిశీలించారు. రోజువారి చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. ఇంటింటికి తిరిగి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని సూచించాడు.