ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం డా.బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ స్కూల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును డీఎస్పీ శ్రావణ కుమార్ ప్రారంభించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.