ప్రకాశం: చంద్రశేఖరపురంలో ఇవాళ సీపీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.