ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల కార్యదర్శి సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.గంగాధర్ ఫోరం ఆవిర్భావం, సేవలను వివరించారు.