ప్రకాశం: వెలిగండ్ల సర్వసభ్య సమావేశం ఈ నెల 19న ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రామన మహాలక్ష్మి అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి వచ్చేటప్పుడు మండల స్థాయి అధికారులు శాఖల వారీగా పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన ఆయన పేర్కొన్నారు.