ATP: అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ గురువారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు సృజనాత్మక రీల్స్, పోస్ట్లు, వీడియోలు తయారు చేయాలని కోరారు. యువతకు చేరేలా సామాజిక బాధ్యతగా ఈ విషయాలపై కంటెంట్ సృష్టించాలని ఎస్పీ జగదీష్ తెలిపారు.