VSP: పెందుర్తి పరిధిలో ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసిన నిందితుడు చందాక రాంబాబుకు జిల్లా మహిళా కోర్టు జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. కొత్త భవనాల వద్ద కాపలా ఉన్న వృద్ధ దంపతులతో పాటు మరో వృద్ధురాలిని నిందితుడు హత్య చేసినట్లు విచారణలో రుజువైంది. శిక్షతో పాటు రూ.30,000ల జరిమానా, బాధితులకు లక్ష రూపాయల పరిహారం ప్రకటించింది.