VZM: చీపురుపల్లిలో శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా ర్యాలీను అడ్డుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. పోలీసులు రాజకీయ నాయకులు కాదని.. వారు ప్రజల కోసం, చట్టాల రక్షణ కోసం పనిచేయాలన్నారు. పేద విద్యార్థుల కోసమే ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు.