GNTR: తెనాలిలోని 17వ వార్డులో ఒకరికి డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. అబ్దుల్ అనే వ్యక్తికి గుంటూరు జీజీహెచ్లో నిర్వహించిన రక్త పరీక్షల్లో డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై 17వ వార్డులో శుక్రవారం ఉదయం బ్లీచింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ (MHO) సూచించారు.