KRNL: వేసవిలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పాయింట్ల వద్ద హరిత పందిర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులకు శుక్రవారం సూచించారు. చెకోపోస్ట్ నుంచి చౌరస్తా ఉన్న అన్ని కూడళ్లలో, కేఎంసీ తాత్కాలిక కార్యాలయం వద్ద పార్కింగ్ పందిర్ల ఏర్పాటుకు టెండర్ పిలవాలని ఆదేశించారు.