PLD: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పశుపోషకులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సూచించారు. శనివారం ఎమ్మెల్యే జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 29 వరకు గ్రామాల్లో ఉచిత టీకా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.