కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీల విగ్రహాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.