E.G: నిడదవోలు మండలం కోరుమామిడి శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని సమిశ్రగూడెం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.