CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ వాసు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.