TPT: తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నారాయణవనం మండలం జంగాలపల్లి, ఎరకంబట్టు గ్రామాల్లో బయోఫోర్టిఫైడ్ మొక్కజొన్న పంట ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించారు. పూసా HQPM-5 రకం మొక్కజొన్న రైతులు సాగు చేసే సాధారణ రకాలతో పోలిస్తే మంచి దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు, 53 మంది రైతులు పాల్గొన్నారు.