సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఇవాళ మంత్రి సవిత పర్యటించనున్నట్లు మండల కన్వీనర్ వెంకటేష్ తెలిపారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.