ఏలూరు: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏలూరు DLTC ప్రధానాచార్యుడు డి. భూషణం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన (PMKVY 4.O) క్రింద ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆ పైన ఉత్తీర్ణులైన వారు 15 – 35 ఏళ్ల వయసున్న వారు దీనికి అర్హులన్నారు.