NTR: నందిగామ మండలం చందాపురంలో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్ది, రాజముద్రతో కూడిన నాణ్యమైన కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూమి సమస్యలు తీరినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.