కోనసీమ: మలికిపురం మండలం మోరిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి వస్తుండగా, గుడిమెల్లంక టి.సావరం జంక్షన్ వద్ద పేరాబత్తుల కొండలరావు (58) బైకును మరొక వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను 108లో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని SI సురేశ్ తెలిపారు.