NTR: కంచికచర్ల మండలం కీసర సమీపంలో విద్యుత్ షాక్ ఘటన జరిగింది. అగ్రిగోల్డ్ ప్రాంతంలో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ఒక వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి NH-65 హైవే అంబులెన్స్లో బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.