KDP: వేంపల్లె పట్టణంలోనీ పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోమవారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె సీఐ నరసింహులు పలు లాడ్జీల్లో రికార్డులను పరిశీలించారు. లాడ్జీ సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. వేంపల్లె సీఐతో పాటు చక్రాయపేట, ఆర్కేవ్యాలీ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.