PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు వివరాలు తెలుపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో మైనార్టీల పాత్ర కీలకమని కొనియాడారు. వారి కోసం గతంలోనే చిలకలూరిపేటలో రూ.18 కోట్లతో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.