NRPT: నర్వ మండల కేంద్రంలో సోమవారం విద్యా కాంప్లెక్స్ సమావేశం జరిగింది. విద్యార్థుల అభ్యాస పురోగతి, హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రాథమిక విద్యా నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు.