KNR: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని కరీంనగర్ అదనపు డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం చల్లూరులో గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను ఏసీపీ మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. పదిమంది చేసే పనిని ఒక కెమెరా చేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇవి కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.