KDP: ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అర్బన్ సీఐ శ్రీరామ్ అన్నారు. ఇవాళ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. క్రమశిక్షణ విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు.