ASR: ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. పాడేరు కలెక్టరేట్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు