KMR: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, పాలుగోన్నారు.